A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Saturday, February 11, 2012

వివేక వాణి


 మీరు ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్కోవచ్చు .. http://www.divshare.com/download/16766221-d2a

Friday, February 3, 2012

అరుణాచలేశ్వర

తిరుపతి తిరుమల తీర్ధ స్నానములకు నైమిత్తిక తిధులు 


 

అరుణాచలేశ్వరుని దివ్య నామావళి



అరుణాచలేశ్వరుల దేవాలయము - ముఖ్యస్థానములు


గిరి ప్రదక్షిణములో చూడదగిన స్థానములు

స్నానము చేయుటకు ముందు పఠించవలసినవి

తీక్ష్ణ దంష్ట్ర!మహాకాయ!కల్పాంతదహనోపమ!
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి.

గంగే! చ యమునే!చైవ గోదావరి! సరస్వతి!
నర్మదే! సింధు! కావేరి !జలే2స్మిన్ సన్నిధిం కురు.

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి,
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి.

యో2సౌ సర్వగతో విష్ణుః చిత్‍స్వరూపీ నిరంజనః,
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః .


పెద్దలు ఇక్కడ వివరించిన శ్లోకాలతో కలిపి, ఈ క్రిందవి కూడా పఠించుతె చాలా మంచిది: 
కావేరి తుంగభద్రాచ క్రిష్ణవేనిచ గౌతమి 
భాగీరతీచ విఖ్యాత పంచ గంగా ప్రకీర్తిత 
త్రిపుష్కర, త్రిపుష్కర, త్రిపుష్కర 
గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం
గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం.

Wednesday, February 1, 2012

శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి

ప్రమాణాలలో మొదటిది వేదం. దాని తరువాత ధర్మ శాస్త్రాలు, పిదప పురాణాల వల్ల తెలియదగిన ఋషుల నడవడి. ఆ తరువాత శిష్టాచారం, చివరి ప్రమాణం మనస్సాక్షి. ఈ క్రమాన్నే మనం అనుసరించాలి. కాని, ఈ కాలంలో అన్నీ తల క్రిందు అయ్యాయి. ఇప్పుడు మొతట మనస్సాక్షి; చిట్టచివరకు వేదం ప్రమాణం!
- శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి
----------------------
ఉగాది  
అందరికీ నమస్సులు
శ్రీ రాధాకృష్ణగారు చక్కని విషయాన్ని ప్రతిపాదించారు. ఈ విషయం చదివిన తరవాత నాకు ఠక్కున పరమాచార్య ఒకానొకప్పుడు ఈ వసంత నవరాత్రులలోనే బాలలతో కలిసి వారికి సందేశం ఇస్తూ వారికి మార్గదర్శకత్వం చేస్తున్నప్పుడు చెప్పిన మాటలు చదివినవి గుర్తుకొచ్చాయి. వాటి సారం క్రింద పొందు పరుస్తున్నాను.
బాలలూ ! ఉగాది, శ్రీరామనవమి, వసంత నవరాత్రులు అత్యంత ముఖ్యమైనవి. ఇలాంటి పండగల రోజులలో కేవలంగా విందు వినోదాలతో కాలక్షేపం చేయకుండా ఏదైనా ఒక మంచి వైదిక పని ప్రారంభించి నియమం పెట్టుకుని ఆ పని చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది.
ఉదాహరణకు శ్రీ రామ నవమి నాడు శ్రీ రామ నామం వ్రాయడం ప్రారంభించి రాముని చిత్రాన్ని ముందు ఉంచుకుని అతని గుణాలను తలచుకుంటూ రామనామాన్ని ఉచ్చరించండి. శ్రీ రామ అని వ్రాస్తూ ఉండడం వల్ల మనోబుద్ద్యహంకారాలు మంచి గుణాల మీద, భావాల మీద కేంద్రీకృతం అవుతాయి. ఈ ప్రకారం ఒక నియమం పెట్టుకుని ప్రతిరోజూ చేస్తే చక్కటి అనుశాసనం, క్రమ శిక్షణ అలవడుతుంది.
ఒక మంచి నియమాన్ని ఈ ఉగాది నాడు ఏర్పరచుకొని దాన్ని సంవత్సరం పొడుగూ నియమం తప్పకుండా చిన్నదో పెద్దదో చేస్తూ పోవటం వల్ల చిత్త శుద్ధికి సమయపాలనకు భగవత్ప్రాప్తికి మార్గం వేసుకోవడంలో దోహదం అవుతాయి.
కాబట్టి మనమూ ఎవరికి తోచింది వీలైంది వారు విధిగా ఏదో ఒక సత్కర్మను ఆరంభించి ముందుకు సాగుదాం. జగద్గురువులై, నడిచేదేవుడని పేర్గాంచిన పరమాచార్య ఎన్నో గొప్ప గొప్ప కార్య క్రమాలకు ఈ ఉగాది, వసంత నవరాత్రులరోజుల్లో శ్రీకారం చుట్టేవారు. గురువులను అనుసరించడమే శిష్యుల కర్తవ్యం. కాబట్టి మనమూ మంచి కార్యక్రమాలకి శ్రీ కారం చుడదాం.
శ్రీ రాధాకృష్ణ గారి ఈమెయిల్ ఐడి శ్రీ సాయి పథం, అంటే సద్గురువాణి వారితో చెప్పించింది. వారు చెప్పినదీ, పరమాచార్య చెప్పినదీ గుర్తుంచుకుని మనం ఈ నందన నామ సంవత్సరాన్ని ఆనంద నందనుని కృపకు పాత్రత పొందేలా మలచుకుందాం.
విధిగా ఈ నూతన సంవత్సరాది నాడు అందరం సాంప్రదాయ దుస్తులు ధరిద్దాం, వైదిక సాంప్రదాయాలను, తెలుగుతనాన్ని నింపుకుందాం. నింబకుసుమ
తత్ర చైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ: అని నిర్ణయసింధు.
అలాగే ఈ రూజు ముఖ్యంగా ఐదు కార్యక్రమాలు చేయాలని పెద్దలు చెప్తారు అవి
) తైలాభ్యంగనం = సూర్యోదయాత్పూర్వమే తైలాభ్యంగన స్నానమాచరించాలి, స్నానం ఎంత శుభ్రంగా చేస్తే అంత లక్ష్మీ ప్రదమని పెద్దలవాక్కు. ఐతే స్నానం సంకల్ప సహితంగా చేయాలి.
) నూతన సంవత్సరాది స్తోత్రం = నూతన సంవత్సరాదిని ఆ సంవత్సరాన్ని ప్రార్థించి ఇష్టదేవతాపూజ చేయటం. ఆ దేవతే కాల స్వరూపంలో ఈ నూతన సంవత్సరంగా వచ్చిందని తలచి సంవత్సరమంతా శుభం కలగాలని కోరుకోవాలి. కుటుంబ సమేతంగా పూజ చేయడం దేవాలయ సందర్శనం చేయడం ఉత్తమం.
)నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం) =  అష్ఠ దారిద్రాలను శోకములను పోగొట్టే ఓ వేప పుష్పమా నాకెల్లప్పుడూ శోకము లేని జీవితమును ప్రసాదించుము అని ప్రార్థిస్తూ, వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, కొత్త కారం ,ఉప్పు, మామిడి పిందెల ముక్కలు తగుపాళ్ళలో వేసి (లేత మామిడి, అశోక చిగుళ్ళు కూడా వేసే ఆచారం ఉంది) కలిపి దేవునికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా అందరూ ఆరోజు తినాలని శాస్త్ర వాక్కు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం యు(ఉ)గాది నాడు సేవించే ఈ లేహ్యాన్ని "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అనీ పిలిచేవారు.
) ధ్వజారోహణం (పూర్ణకుంభదానం) = ఈ నాడు నూతన సంవత్సరాది కాబట్టి అందరి ఇళ్లపైనా నూతన ధ్వజారోహణం చేసేవారు (ఇప్పటికీ ఇళ్ళముందు, పైన భగవంతుని ముద్రాంకితమైన కాషాయ జెండాలు కట్టి ఎగురవేసేవారున్నారు). ఈ నాడు కొత్త కుండ కొని పూర్ణంగా నీరు నింపి దానం చేసే ఆచారమూ ఉంది.
)పంచాంగ శ్రవణం = ఈ నాడు సంవత్సరాదిని పురస్కరించుకుని రాబోవు కాలాన్ని జ్యోతిష్య శాస్త్రంతో కనిపెట్టి ఆయా గ్రహ గతులు, రాశి ఫలాలు, గ్రహణాలు, ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు రోజువారీ తిథి వార నక్షత్ర కరణ యొగాది విషయాలుండే పంచాగ శ్రవణం ఇత్యాదులు చేస్తారు. పంచాంగ శ్రవణం ద్వారా కాల స్వరూపుడైన భగవంతుని కృపకు పాత్రులు కాగలమనీ తద్వారా కాలంలో ఎదురయ్యే ప్రమాదాలతీవ్రతను భగవత్కృపతో తగ్గించుకోవచ్చనీ పెద్దలు చెప్తారు.
(ఐతే ఒక్కో పంచాంగంలో ఒక్కోలా ఉన్నదని విమర్శ ఉన్నది, అది కేవలం పంచాంగ కర్త వాడే పద ప్రయోగపు తేడా ప్రజ్ఙ లోపమే కానీ జ్యోతిష్య శాస్త్రలోపమెన్నటికీ కాదు.)
స్వస్తి: ప్రజాభ్య: పరిపాలయంతామ్ న్యాయ్యేన మార్గేన మహీమ్ మహీశా:
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమ్ లోకా సమస్తా సుఖినోభవంతు
  ------
సత్సంగము గ్రూప్ నుంచి వచ్చిన మెయిల్ ని నేను మీతో పంచుకోవడం జరిగింది . మీకు ఆసక్తి ఉంటే సత్సంగము గ్రూప్ లో జాయిన్ అవండి .