A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Friday, March 15, 2013

ఆచార్యుడే ఈశ్వరుడు

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

8.ఆచార్యుడే ఈశ్వరుడు
ఆచార్య పురుషులకు బంధము లేదు. వారు స్వతంత్రులు, నిత్యముక్తులు. మనకు నియమబద్ధ జీవనాన్ని చూపుటకొరకే వారు ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. అట్టివారి సేవ శీఘ్రఫలదం. ఈశ్వరుడే ఆచార్యుని రూపములో మనకి జ్ఞాన దానం చేస్తున్నాడు. 'ఈశావాస్యమిదం సర్వం' అన్నారు. సర్వమూ ఈశ్వరుడే, అప్పుడు గురువులోనూ ఆచార్యునిలోనూ ఉన్నాడంటే అభ్యంతరమేమి?

అట్లా అయితే మనం ఎవరం? మనమూ ఈశ్వరులమే కదా. మరొకరిని ఆచార్యుడనీ, ఈశ్వరుడనీ మనమెందుకు ఆరాధించాలి?

అన్నీ అతడే. కానీ మన ఈశ్వరత్వాన్ని మనం స్వయంగా గుర్తించలేకున్నాము. కించిత్తైనా మన ఈశ్వరత్వాన్ని మనం గుర్తించగలిగితే ఈ కామక్రోధాలు, ఆశాపాశాలు, దుఃఖం, కష్టం, పాపం ఉంటాయా?? మనం ఈశ్వరులం అన్న జ్ఞానం లేక అలమటిస్తున్నాము. కానీ ఆచార్యునికి తన ఈశ్వరత్వం తెలుసు. ఆయనకు మనకున్న సుఖ దుఃఖాలు లేవు. అతడు ద్వంద్వాలకు అతీతుడు. మనలో చూడలేని ఈశ్వరత్వాన్ని అతనిలో మనం చూడగలుగుతున్నాము. ఈ సత్యాన్ని మనం తెలుసుకుని మనం ఆచార్యుని సేవ చేశామంటే, ఆయన మన అజ్ఞానమనే తెరని తొలగించి, మనలో సత్యప్రతిష్ట చేయగలడు.

అందుకని పరమార్ధ ప్రయోజనం కోసం ఆచార్యుని ఇప్పుడే ఇక్కడే ఈశ్వరునిగా భావించి విధేయులమై ఆయన అనుగ్రహం చేసిన ఉపదేశానుసారం జీవితాలను నడుపుకోవాలి.

9. స్వధర్మాన్ని పాటించండి
మన పూర్వ కర్మానుసారం ఈశ్వరుడు జన్మను విధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈశ్వరుడు మనల్ని ఏ మతంలో, ఏ శాఖలో, ఏ సాంప్రదాయంలో పుట్టించాడో తదనుసారం జీవితం గడుపుతూ కర్మక్షాళనం చేసుకుని పురుషార్ధాన్ని సాధించాలి. మన శాఖకో, జాతికో ఏర్పడిన ఆచార్యోపదేశం అనుసరించితే చాలు. ఆ సిద్ధాంతాలు అసంపూర్ణమైననూ పర్వాలేదు.

కర్మశేషం ఉండడం వలన జీవునికి పూర్ణత్వం అవగతమవడం లేదు. కానీ ఏ మతంలో పుట్టామో ఆ మతం అసంపూర్ణమైనా, పూర్ణ కర్మ క్షయానికి అది సహాయ పడుతుంది. ఎవనికి అనన్య భక్తి ఉన్నదో, తన్ను పూర్తిగా భగవంతునికి అర్పణ చేసుకుంటున్నాడో వానికి ఈశ్వరుడు ఎన్నడూ ప్రణష్టుడు కాదు. ఈశ్వరానుగ్రహం అతనికి అన్ని కాలములలోనూ ఉంటుంది. "ఈ జీవితాన్ని నీవు నాకు ప్రసాదించావు. నేను నా సాంప్రదాయాచార్యుని పాదములు నమ్ముకున్నాను" అని ఎవడైతే తన కులధర్మాన్ని అస్ఖలిత శ్రద్ధతో పాటిస్తున్నాడో, వానికి ఈశ్వరుడు పరిపూర్ణత అనుగ్రహిస్తాడు.

మన ఆచార్యుడే ఈశ్వరుడు అన్న విశ్వాసం మనకి ఉండాలి. గురువుకి స్వాత్మార్పణ చేసుకుంటే అది ఈశ్వరార్పణే. గురువు వద్ద చేసే ప్రపత్తి అది ఈశ్వర ప్రపత్తియే. ఈ విషయం ఉపనిషత్తులను పారాయణ చేసేటప్పుడు చెప్పే శాంతి పాఠంలో ఉంది.

యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తంహదేవం ఆత్మ బుద్ధి ప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే II


"ఎవడు బ్రహ్మను పూర్వం సృష్టించాడో, వేదములను అతనికి అనుగ్రహించాడో, ఆ ప్రకాశరూపుని, బుద్ధిప్రేరకుని మోక్షార్ధం శరణు చెందుతున్నాను".

ఒక సాంప్రదాయాన్ని అనుసరించక స్వబుద్ధిపై ఆధారపడేవానికి అనర్ధమే కలుగుతుంది. అట్టివారు చేసే హాని మూర్ఖులు చేసే హాని కంటే అధికం. ఒక సాంప్రదాయాన్ని అనుసరించని వాడు మూర్ఖుడని శంకర భగవత్పాదులు ఉపదేశ సాహస్రిలో చెప్పారు. జ్ఞానలాభానికి గురుభక్తి అవసరం. పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం కలుగుతుందన్న నిశ్చయం లేదు.

10. దేవతలే శిష్యులుగా ఉండడం
మనందరమూ సాంప్రదాయాన్ని వదలరాదు. సంప్రదాయ ఆచార్యుల యందు భక్తిని కలిగి ఉండాలి. గురువుల అడుగుజాడలలో మనం నడవాలి. మన ఆచార్యులందరూ పరమ గురుభక్తులే.

మనకు మొదటి గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పరమేశ్వరుడే. ఆయనకూడా ఒక గురువుని వరించి ఉపదేశం పొందవలసి వచ్చింది. ఆయన తనపుత్రుని వద్ద వినయవిధేయతలతో ప్రణవం ఉపదేశం పొందాడు.

జ్ఞాన స్వరూపమే అంబిక (అమ్మవారు). ఆమె కూడా తన భర్త ఈశ్వరుని వద్ద శిష్యరికం చేసింది. ఆమెకు ఈశ్వరుడు ఆగమములను, తంత్రములనూ ఉపదేశించాడు. అంతేకాదు ఆమెకు క్రింది తారక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే II

మూరు మార్లు రామ నామం చేస్తే అది వేయి విష్ణు నామాలు చేసినంత పుణ్యం.

ఈశ్వరుడు అంబికకి ఉపదేశించాడు అన్న విషయం ఎన్నో స్థలపురాణాలలోనూ ఉన్నది. మహావిష్ణువు రామకృష్ణాది అవతారములలో గురుకుల వాసం చేశాడు. రాముడు వశిష్ఠుని వద్ద, కృష్ణుడు సాందీపమహర్షి వద్ద గురుకుల వాసం చేశారు. కృష్ణుడు తన సహాధ్యాయి అయిన సుధామునితో వానలో, తుఫానులో వంట చెఱకు కోసం వెళ్ళాడు. చిత్రకూటంలో భరతునితో పాటు వశిష్టుడు వచ్చి రాముని తిరిగి అయోధ్యకి రమ్మని కోరినప్పుడు, ఆయన గురువు యొక్క సమ్మతితో, అయోధ్యకి మరలి వచ్చుటకు నిరాకరించాడు. ఈ నిరాకరన కూడా వినయపూర్వకముగానే చేశాడు.

గురుపరంపరలో దత్తాత్రేయస్వామికి ఒక విశిష్ట స్థానమున్నది. భాగవతంలో ఆయన తనకు 24 గురువులు ఉన్నట్లు చెప్పాడు. భూమి, నీళ్ళు, కొండచిలువ, కందిరీగ, వేశ్య, వేటగాడు, శిశువు - వీళ్లంతా ఆయనకి గురువులు అన్నాడు. ఒక్కక్కరి వద్దా ఒక్కో పాఠం తాను నేర్చుకున్నట్లు ఆయన వివరంగా చెప్పుకున్నాడు.



(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

పూర్ణత్వమునకు ఎన్నో మార్గములు

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

6. పూర్ణత్వమునకు ఎన్నో మార్గములు
దీక్షలు పలు రకములు. దీక్షా మార్గములు ఎన్నో ఉన్నా, గమ్యం ఒక్కటే. ఒకే గురువు తన శిష్యులలో ఒక్కొక్కరికీ ఒక్కో మార్గం నిర్దేశించవచ్చు. కానీ ఆచార్యుడు మాత్రం శిష్యులకు ఒకే సాంప్రదాయమును ఉపదేశిస్తాడు.

గురువులు శిష్యులను మంత్ర, తంత్ర, యోగాద్వైత మార్గములలో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చును. తిరుమంత్రం అనే గ్రంధంలో తిరుమూలర్ అనే సిద్ధుడు వివిధ మార్గములను విశదీకరించి యోగ జ్ఞానములతో ముగింపు చేశాడు. తిరుమూలర్ తో ఒక గురుపరంపర ఆరంభమైనది. ఈ పరంపరలో సారమామునివర్ ఒకరు. ఆయన తిరుచినాపల్లిలో ఒక మఠాన్ని స్థాపించాడు. ఈ మఠానికి ఒక సమయంలో మౌనగురువు అనే ఆయన అధిపతిగా ఉండేవారు. తాయుమానివర్ కి ఈయనే గురువు. తాయుమానివర్ క్రీ.శ. 17వ శతాబ్దానికి చెందినవాడు. మౌనగురువు అనంతరం ఈ మఠం ధర్మపుర అధీనం కిందకు వచ్చింది.


దక్షిణామూర్తి స్వామి సనకాది మునులకు మౌనవ్యాఖ్యా రూపంగా జ్ఞానబోధ చేస్తున్నాడు. తాయుమానవర్ కూడా అన్నిమార్గాలు చిట్టచివర మౌనమార్గంలో లయిస్తాయని చెప్తున్నాడు.

మన నిజతత్త్వం మౌనమే. ఆ మౌనాన్ని మరచిపోలేని సంసారంలో పడుతున్నాము. సంసారం అంటే మాయ. అమ్మవారే మహామాయ. ఆ మహామాయయే జ్ఞానాంబికగా అవతరించి మన అజ్ఞానాన్ని పోగొడుతూ ఉంది. ఈ జ్ఞానబోధకే ఆమె గురుస్వరూపిణి అవుతున్నది. ఆ జగన్మాత మనకి జ్ఞానమనే క్షీరాన్ని ఇస్తున్నది. ఈ లోకంలో, చెట్టూ, చేమలూ, పక్షులూ, పండ్లూ, వివిధ వస్తుజాలమూ అంతా ఆమె సృష్టియే. ఎన్నో రంగులు, ఎన్నో వాసనలు, ఎన్నో రూపాలు మనుష్యులలో ఎన్నో మనోభావాలు. అంతా ఆ మహామాయ విలాసమే. ఆమెయే లిపి రూపంగానూ, భాషారూపముగానూ, శాస్త్రరూపముగానూ ఉన్నది. అన్నిటికి ఆవల మౌనం, మహామౌనం. మౌనగురువుగా ఆమె అవతరించి శిష్యునికి జ్ఞానబోధ చేస్తుంది. "ఏకంసత్" అని.

7. గురువూ ఆచార్యుడూ ఒక్కరే
మొత్తం మీద నేను చెప్పేది (అంటే పరమాచార్య స్వామి వారు..), మనకి జ్ఞానం దానం చేసే వారిని గురువు, ఆచార్యుడూ అని పిలుస్తున్నాము. మహత్త్వమున్నందున గురువు అని పేర్కొంటున్నాము. శ్రోత్రియుడూ, అనుష్టానపరుడూ, సంప్రదాయజ్ఞుడూ అయిన వానిని ఆచార్యుడు అంటున్నాము. ఆచార్యుడు సాంప్రదాయ మర్మములను మనకి తెలిపి మనలను అనుష్టాన పరులుగా చేస్తున్నాడు. గురువు తన మహత్వం చేతా, అనుగ్రహం చేతా మనకు జ్ఞానం దానం చేస్తున్నాడు. ఆచార్యుడు శాస్త్ర సాంప్రదాయాల మూలకముగా మనకు ఆచార అనుష్టానాలను తెలిపి జ్ఞానం పొందడానికి తోడ్పడుతున్నాడు.

ఈ విధంగా ఆచార్యునికీ, గురువుకీ కించిత్ భేదమున్నప్పటికీ, పాత్రత ఉన్న ఆచార్యుడు గురువు కూడా కాగలడు. ఆచార్యుడు ఒక సాంప్రదాయానికి చెంది తదనుసారులైన ఆచార అనుష్టానాలను బోధిస్తున్నా, తన వరకూ ఒక విధానానికి కట్టుబడక ఈశ్వరానుభవమూ, ఆత్మానుభవమూ పొంది ఉండినట్లైతే, అతడు అనుగ్రహదానం చేయగలడు. మన ఆచార్య పురుషులందరూ ఈ కోవకి చెందిన వారే.

ఆధ్యాత్మిక జీవనారంభంలో కొన్ని కట్టుబాట్లు ఉండవలసినదే. అపుడే మనసుకు ఒక నిలకడ ఏర్పడగలదు. అందులకు మన పెద్దలు యమ నియమాలు చెప్పారు. ఈ కట్టుబాట్లు ఉన్నంత వరకూ మనమందరమూ శిష్యులమే. నిర్భందముగా అనిపించే ఈ నియమాలు కొంత కాలానికి సహజమైపోతాయి. అతనికి నియమ పాలనం చేస్తున్నానని కూడా అనిపించదు. అపుడు అతడు ఇతరులను కూడా ఆ మార్గములో ప్రవేశపెట్టగలడు. అట్టివాడు చేసే ఉపదేశాలు ఇతరులని గాఢంగా ప్రభావితులను చేయగలవు.

ఆచార్యుల స్థానంలో వచ్చిన ఈకాలం గురువులకు విద్వత్తు ఉంటే చాలు, ఆచార అనుష్టానాలు వారికి అక్కర్లేదు. పూర్వకాలంలో విద్వత్తు,
ఆచార అనుష్టానాలున్నవారినే ఆచార్యుడు అని పిలిచేవారు. అనుష్టానము అంగమే కానీ లక్ష్యం కాదు. అనుష్టానం అనుభూతిలో ముగియాలి. అట్టి అనుభూతి పరునకు ఆచారం స్వాభావికమైపోతుంది.

అనుష్టానము ఉన్నప్పుడే విద్యకు పూర్ణత. అనుష్టానానికి పూర్ణత్వం అనుభూతియే. అనుభూతి కలవాడే గురువనీ, అనుష్టానపరుడు మాత్రమే ఆచార్యుడనీ చెబితే అదీ సరికాదు. నిజమైన ఆచార్యునికి ఆచరమూ, అనుష్టానము రెండూ ఉంటాయి. బాహ్య జీవనం అనుష్టాన బద్ధముగా ఉంటూ, ఆంతరంగికముగా అతడు ఏ కట్టుబాటూ లేక కైవల్యంలో ఉంటాడు. అట్టివాడే మార్గదర్శకముగా ఉండగలడు. అతడు ఆంతరంగ మౌనం భజిస్తూ, బయత ఉపదేశ, ఉపన్యాస కార్యావళిలో మగ్నుడై ఉంటాడు.

గురువు-ఆచార్యుడు ఇద్దరూ ఒక్కటే. ఆదికాలం నుంచి వీనిని పర్యాయపదాలుగానే వాడుతున్నారు. ఉపనిషత్తులు వేదశిఖరములు. వానిలో పూర్తిగా ఆచార్య పదప్రయోగమే చేయబడినది.  ఆచార్య దేవోభవ అనీ, ఆచార్యునికి అతను కోరిన దక్షిన ఇవ్వవలెననీ, ఆచార్యవాన్ పురుషోవేదా - ఆచార్యుడున్న వాడే జ్ఞాని కాగలడు అనీ ఉపనిషత్తులు చెబుతున్నవి. అయినప్పటికీ ఆచార్యునితో సహవాసం చేస్తూ విద్యాభ్యాసం చేసే విధానాన్ని గురుకులవాసమని అన్నారు కానీ ఆచార్యవాసమని అనలేదు. ఆచార్యుని కృతజ్ఞతా పూర్వకముగా ఆరాధించే దినమును గురుపౌర్ణమి అన్నారు. వ్యాసాచార్యులు, శుకాచార్యులు, గౌడపాదాచార్యులు, గోవిందభగవత్పాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు వీరినందరినీ చేర్చి 'గురుపరంపర' అని వ్యవహరిస్తున్నాము. వారిని ఆచార్య పరంపర అని అనడం లేదు. ఇదే విధంగా రామానుజ, వల్లభాచార్య, మధ్వాచార్య సాంప్రదాయములలో కూడా గురువందనమనే అంటారు.

శైవ సిద్ధాంతాన్ని పాటించే గురువులను కూడా ఆచార్యులనే అంటారు. మైకండాచార్య, సంతనాచార్య మొదలైనవారు శైవసిద్ధాంతానికి చెందిన వారు. గురువులు సిద్ధిపొందినదినము తమ గురుస్మారకముగా ఆరాధన చేస్తారు. అదే గురుపూజ అంటారు.

(సశేషం ......)



సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

అంబికానుగ్రమే దీక్ష

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

5. అంబికానుగ్రమే దీక్ష
సచ్చిదానందమని మనం చెబుతూ ఉంటాము. చిత్ అనే పదానికి జ్ఞానం అని అర్ధం. అంబికయే జ్ఞాన స్వరూపిణి. లలితాసహస్ర నామాలలో చిదేకరసరూపిణి అని ఒక నామం ఉన్నది. ఏకరసము చిత్తే. శ్రీకాళహస్తిలో అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అని అంటారు.

గురురూపములో వచ్చి మనల్ని అనుగ్రహించేది అంబికయే. కాళిదాసు "దేశిక రూపేణ దర్శితభ్యుదయాం" అని అమ్మవారిని కీర్తించారు. దేశికుడంటే గురువే. వైష్ణవ సాంప్రదాయ ఆచారములో వేదాంతదేశికులొకరు. భగవత్పాదుల శిష్యుడు తోటకాచార్యులు ఆయన చేసిన తోటకాష్టకంలో 'శంకర దేశికమే శరణం' అని ప్రార్ధించారు. దేశికుడంటే అన్ని ప్రదేశాలను ఎరిగిన వాడు, శాస్త్ర నిష్ణాత. దేశికుని రూపములో అంబ అవతరించి శిష్యుణ్ణి స్పర్శ, నయన, స్మరణ దీక్షలతో అనుగ్రహిస్తున్నది.

స్పర్సదీక్షను కుక్కుటదీక్ష అనీ, నయనదీక్షను మత్స్య దీక్ష అనీ, స్మరణదీక్షని కమఠ దీక్ష అనీ అంటారు.

గురువు అనుగ్రహించిన దీక్ష ప్రతిభావంతమై ఉంటే, ఆ శిష్యుడు తన అర్ధరహితమైన జీవితానికి స్వస్తిచెప్పి పరమార్ధిక పథగాముడై పోతాడు. నిజానికి అది అతనికి ఒక పునర్జన్మ అనే అనాలి. అందులకే గాయత్రీ మంత్రోపదేశం చేత ఒకడు ద్విజుడౌతున్నాడు. ద్విజ అంటే రెండో పుట్టుక.

అంటే దీక్షకు ముందు ఒక జన్మ ఉండినదనీ, దీక్ష పిదప మరల అతను జన్మిస్తున్నాడనీ కాదు దీనర్ధం. దీక్షకు ముందుకూడా అతడు అంతరంగములో బ్రహ్మభేదముగా ఉండినప్పటికీ, అతనికి ఆ ఎరుక లేకపోవడం చేత, అతను అజ్ఞానము నందు ఉండినాడు. దీక్షా మూలముగా ఆ అజ్ఞానమనే పొర అతనిని వీడిపోయింది. ఒక కోడి గుడ్లు పెట్టి దానిపై కూర్చుని పొదిగినప్పుడు, గుడ్డును పగులగొట్టుకొని పొర నుండి బయటపడే కోడిపిల్ల వలే, శిష్యుడూ, గురువు అనుగ్రహించిన కుక్కుట దీక్షా మూలముగా (కుక్కుటం అంటే కోడి) అజ్ఞానం అనే అండాన్ని భేదించుకొని, జ్ఞాని ప్రపంచములో పడుతున్నాడు. తన నిజతత్త్వమేమో తెలుసుకుంటున్నాడు.

నీళ్లలో చేపలు గ్రుడ్లు పెడతాయి. ఆ గ్రుడ్లు నీళ్ళలో తేలుతూ ఉంటాయి. చేపలు ఆ గ్రుడ్లపై కూర్చుని పొదగడంలేదు. తేలుతూ ఉన్న ఆగుడ్లని అవి చూసినంత మాత్రాన, అవి చేపపిల్లలౌతాయని మన శాస్త్ర సాంప్రదాయం. అందుకే గురువు యొక్క వీక్షా దీక్షని మత్య్స దీక్ష అని అంటారు.

ఇక కమఠ దీక్ష సంగతి అంటే తాబేలు. తాబేలు గ్రుడ్లను ఇసుకలో పెట్టి మళ్ళా నీళ్లలోకి వెళ్ళిపోతుంది. ఆ గుడ్ల సమక్షంలో లేకపోయినా తాబేలుకు అదే ధ్యాస. ఆ పిల్లలు సుఖంగా గుడ్ల నుంచీ బయట పడతాయా లేదా అని విచారిస్తూనే ఉంటుంది. దాని స్మరణ బలం చేతనే గుడ్లు పొదగబడి తాబేలు పిల్లలు బయటకి వస్తాయి. అందుకే గురువు యొక్క స్మరణ దీక్షను కమఠ దీక్ష అని కూడా అంటారు.

అంబిక ఏ విధముగా దేశిక రూపములో ఈ మూడురకాలైన దీక్షలను మనకు అనుగ్రహిస్తున్నది??
అంబిక (అమ్మవారు) అక్షత్రయమని, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని మూడు రూపాలలో ఆవిర్భవించి ఉన్నది. ఆమె అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో..

శృతీనాం మూర్ధానో దధతి తనయౌ శేఖరతయా
మమాస్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌః


"అమ్మా!! నీ పాదాలను ఆ శృతి శిరస్సులనబడే ఉపనిషుత్తులే తలదాల్చి ఉన్నవి. అట్టి నీ చరణములను నా శిరస్సుపై ఉంచి, నన్ను అనుగ్రహించు అని వేడుకుంటూన్నారు. ఉపనిషత్తులు వేదాంతాన్ని బోధిస్తాయి. శంకరుల జ్ఞాన మార్గము వేదాంత సాంప్రదాయమే.
జ్ఞానస్వరూపిణియే కామాక్షి. ఆమెను భగవత్పాదుల వారు స్పర్శ దీక్షకై ప్రార్ధిస్తున్నారు.

మదురలో మీనాక్షి అమ్మ ఉన్నది, ఆమె మీన నేత్ర. ఆమె మనకి అనుగ్రహించే దీక్ష నయన దీక్ష. ఆమె కటాక్షములే మనకు జ్ఞాన దీక్ష ఇస్తున్నది. ఇకపోతే కాశీలో విశాలాక్షి ఉన్నది, ఆమె సర్వకాలములలోనూ మనల్నే స్మరిస్తూ, స్మరణదీక్షా ప్రదానం చేస్తున్నది. ఆమె అనుగ్రహించేదే కమఠ దీక్ష.

ఈ విధంగా అంబిక మూడు రూపాలలో మూడు విధాలైన దీక్షలను అందరికీ అనుగ్రహిస్తూ పరతత్త్వజ్ఞానదానం చేస్తూఉన్నది.

(సశేషం ......)

గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!


సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

దీక్ష

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు


దీక్ష
ఉపదేశమూలకముగా గురు-శిష్య సంబంధం ఏర్పడుతున్నదనే విషయం గురించి ఇంతవరకూ చెప్పాను. శాస్త్ర పరిభాషలో దీనినే "దీక్ష" అంటారు. తమిళంలో దీనిని "దీక్కై" అని చెబుతారు. ఉపదేశమూలకముగా గురువు నుంచి ఒక చైతన్యము శిష్యుడిలో ప్రవేశించి, తీవ్ర సంవేగాన్ని కల్పించి, ఆధ్యాత్మ మార్గములో ఒక అన్వేషణకి పురికొల్పేదే దీక్ష. ఈ చైతన్యం దీక్ష అయిపోయినంతనే అంతరించిపోవడం లేదు. ఈ చైతన్యము శిష్యునిలో ప్రవిష్టమై, అతనిని ఆధ్యాత్మంలో ఉన్నత లక్ష్యాలకు తీసుకువెళ్ళి, మంత్రసిద్ధి కలుగజేస్తున్నది.

గురువు ఒక్కమారైనా సరే, మంత్రోపదేశం చేసియో, కటాక్షమూలకముగానో, హస్తమస్తక స్పర్శనం చేతనో, అనుకంపన చేతనో గురుశిష్య సంబంధమైన దీక్షని ఇచ్చినట్లైతే, ఆ అనుగ్రహం శిష్యుని మీద ఎల్లకాలమూ ఉంటుంది. స్విచ్చిని నొక్కి ఉంచినంతసేపూ బల్బు వెలిగేట్లు ఈ అనుగ్రహం పనిచేస్తుంది. ఆచార్యుడు శిష్యుడిని సమక్షంలో ఉంచుకుని దీర్ఘ కాలం అతనికి విద్యను, అనుష్టాన విధానాలను బోధించాల్సి ఉంటుంది. గురువు విషయం అట్లా కాదు. అతనికి శిష్యునితో స్థూల సంబంధం అక్కర్లేదు. అతనికి ఒక్క క్షణం ఉంటే చాలు. కొన్ని సమయాలలో అదికూడా అక్కర్లేదు. అతని అనుగ్రహం దీక్షామూలకముగా ప్రసరించి, శిష్యుని సంసారాన్ని క్షణంలో భస్మం చేస్తుంది. శిష్యునికి సిద్ధి ప్రాప్తించేవరకు, గురువు అనుగ్రహం అన్నికాలాలలోనూ అతనితో ఉంటుంది.

దీక్ష ఇచ్చినవాడు గురువు. భారత, రామాయణాదులలో, పురాణాలలో తండ్రియే గురువని చెప్పబడినది. తండ్రి ఘనుడైనా సరే, కాకపోయినా సరే, మహాత్ముడైనా సరే కాకపోయినా సరే, తనయునికి అతను దైవసమానుడే. వేదాలు పితృదేవోభవ అని కూడా చెప్పినవి. తండ్రిని గురువుగా భావించడానికి మరో కారణం కూడా ఉంది. పుత్రునికి బ్రహ్మోపదేశ సమయంలో తండ్రియే కదా గాయత్రీ మంత్ర దీక్ష ఇస్తున్నది? తండ్రిని గురువుగా భావించడానికి ఈ ఆచారము కూడా కారణము.

ఇదే కాదు, అక్షరాభ్యాసకాలంలో, తండ్రి కుమారునికి "ఓమ్ నమో నారాయణాయ" అని అష్టాక్షరియో, "ఓం నమః శివాయ" అని పంచాక్షరీయో ఉపదేశం చేసే ఆచారం మనలో ఉంది. ఈ కారణంగా కూడా తండ్రి కుమారునికి గురువు అవుతున్నాడు. గురువు వద్ద శరణుజొచ్చిన శిష్యుడు శరణాగతి కారణంగా జ్ఞానలాభాన్ని పొందుతున్నాడు. ఈ జ్ఞానోపలబ్ధికి గురువు యొక్క లాఘవం కానీ, అనుభూతి రాహిత్యంకానీ అడ్డురాదు. శరణాగతి యొక్క మహాత్మ్యం అలాంటిది.

ఇలాంటి గురుభక్తి గురించి చెప్తున్నప్పుడు, కంచి మఠంలో జరిగిన ఒక ఉదంతం జ్ఞప్తికి వస్తున్నది. మఠ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు కుర్రవాళ్లని చూచి, మీ అధ్యాపకులు వచ్చారా అని నేను అడిగాను. ఒక బాలుడు ఇంకా రాలేదు అని బదులిచ్చాడు. రెండవ వాడు "ఆ! వచ్చారు" అని బదులు చెప్పాడు. నిజానికి అధ్యాపకుడు రాలేదు. రెండవ అబ్బాయితో ఎందుకు నీవు ఈ విషయములో అబద్ధము చెప్పావు అని నేను అడుగగా, "గురువు రానిదేమో నిజమే! ఆయన రాలేదంటే ఆయన లోపం చూపినట్లవుతుంది. అందుచేత నిజం చెప్పి గురువు యందు దోషం చూపేదాని కన్నా, అబద్ధం చెప్పి దోషాన్ని చూపకుండుట మంచిదని తోచి అట్లు చెప్పాను" అని అన్నాడు.

గురువు యోగ్యత ఎలాంటిదైనా సరే, శిష్యునికి అఖండమైన, అనన్యమైన భక్తి ఉంటే, అతనిని ఈశ్వరానుగ్రహం వెన్నంటియే ఉంటుంది.

మనం ఏ విషయాన్నైనా స్వయంగా నేర్చుకుంటే అది అహంకారానికి దారితీస్తుంది. ఏ విద్యకైనా ఒక గురువు అవసరం. మంత్రములు కూడా స్వయంగా గ్రహించినవి కాక, గురూపదేశములై ఉండవలె. గురువు లేకుండా తీసుకున్న మంత్రమో, చదివిన విద్యయో, "భార్యకు ఆమె ప్రియుడి చేత కలిగిన సంతానము వంటిది, అతనిని కుమారుడని పిలుచుకోవచ్చు, కానీ వైదిక కర్మలు చేయడానికి అతనికి అర్హత లేదు".

అందుచేత దీక్షకు గురువు అనివార్యము. వాగ్రూపక దీక్ష - మంత్రోపదేశము, కటాక్షముతో అనుగ్రహించే దీక్ష - నయనదీక్ష, శిష్యుని స్పర్శతో అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదులు - అంటే భగవంతుని పాదములు శిరసా గ్రహించి, ఆ పాదములే తాను అయినవాడు అని అర్ధం. అనగా మనం శంకర భగవత్పాదుల వారిని శిరసా ధరించాలి. గురువు ప్రత్యక్షోపదేశం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎక్కడో దూరాన గురువు కూర్చుని శిష్యుని స్మరించినంత మాత్రాన, శిష్యునికి స్మరణ దీక్ష లభ్యమౌతున్నది.

(సశేషం ......)



సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

గురువు - ప్రపంచము

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

గురువు - ప్రపంచము
ఒక గురువు క్రమపద్ధతిలో బోధ చేయడానికి ఇష్టపడక పోవచ్చును. కానీ శిష్యులను ఆశీర్వదించాలని కోరుకోవచ్చును. ఇంకో మహాత్ముడు ఆశ్రితుల విషయంలో ఈ ఆశీర్వాద బాధ్యత కూడా మనకెందుకని ఊరుకోవచ్చును. అలాంటప్పుడు ఆ ఆశ్రితులను ఈశ్వరుడే రక్షిస్తాడు. వరప్రదానం చేస్తాడు. అనన్యంగా నమ్ముకున్న ఆ ఆశ్రితులకు దేవుని చేయూత ఎప్పుడూ ఉంటుంది.

అంధకారాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించే ఏ సంభవమైనా ఉపదేశమే.

సాధారణంగా ఒక గురువే శిష్యుని మంత్రోపదేశం ద్వారా అనుగ్రహించి అతనికి శక్తిపాతం కలిగిస్తాడు. కొందరు మహాత్ములు శాస్త్రోపన్యాసములు ఇవ్వకపోయినా వారి శిష్యులకు మాత్రం మంత్రోపదేశం చేస్తారు. మనం ఎన్ని కథలు చదివి ఉన్నాం. ఒక మహాత్ముని ముందు ఒకడు ఎంతో కాలం పడిగాపులు కాస్తూ ఉంటాడు. ఒక్కరోజు హఠాత్తుగా ఆ మహాత్ముడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ క్షణం నుంచీ అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. గురుమూలకంగా మంత్రోపదేశం పొందాలని తపస్సు చేసిన శిష్యులూ, యుక్తి చాతుర్యం ప్రకటన చేసిన శిష్యులూ ఉన్నారు.

ఇక్కడ కబీరు కథ చెప్పాలి. రామానందులనే ఒక మహాత్ముని వద్ద కబీరు రామ మంత్రోపదేశం పొందాలని పరితపించేవాడు. కానీ అతడు ముస్లిము. అతడు హిందువే అనీ ముస్లిములచేత పెంచబడ్డాడనీ కొందరంటారు. రామానందులు తనకి మంత్రోపదేశం ఇవ్వరేమో అని అతనికి తోచింది. ఎట్లాగైనా ఆయన వద్ద మంత్రోపదేశం పొందాలని ఒక ఎత్తు వేశాడు. ఒకరోజు బ్రాహ్మీ ముహూర్తములో రామానందులు గంగా స్నానానికి వచ్చారు. కబీరు గంగా నది స్నాన ఘట్టంలో మెట్లమీద పడుకొని ఉన్నాడు. చీకటిగా ఉన్నందున రామానందుల వారు పడుకుని ఉన్న కబీరు మీద పాదములు మోపారు. కబీరు దానినే 'పాదదీక్ష'గా స్వీకరించాడు. (దీక్ష గురించి తర్వాత చెబుతాను..) ఎవరినో త్రొక్కినట్లు తోచగానే ఆయన రామరామ అని పాదాఘాతానికి ప్రాయశ్చిత్తముగా గట్టిగా ఉఛ్చరించారు. కబీరుకు అదే ఉపదేశమైనది. తారకమంత్రాన్ని ఏ విధంగానైనా రామానందుల వారి నుండి పొందాలని కబీరు ఈ పన్నాగం పన్నినాడు.

ఇంతకూ ఈ కథ ఎందుకు చెప్పానంటే రామానందుల వారు ఉద్దేశ పూర్వకముగా కబీరుకు మంత్రోపదేశము చేయలేదు. కానీ ఆయన రామరామ అనగానే, శిష్యుని సంకల్పం వలన, వారి అనుద్దేశపూర్వకమైన ఉఛ్చారణవలనా "గురుశిష్య సంబంధం" ఏర్పడినది అని చెప్పుటకు ఈ ఉదాహరణ.

మంత్రోపదేశం చేసిన వానిని గురువంటారు. ఈ మంత్రోపదేశం చేత గురుశిష్యుల మధ్య ఒక లంకె ఏర్పడుతుంది. ఆ మంత్రాన్ని వివరించవలసిన అవసరమూ లేదు. అది ఆచార్యుని పని. అకస్మాత్తుగా అనుద్దేశపూర్వకముగా ఒక మంత్రము ఉఛ్చరించినా గురువు అనుగ్రహం మంత్రం ద్వారా శిష్యుడిని సంక్రమిస్తుంది. లేదా ఆ మంత్ర శక్తి గురువు అనుగ్రహానికి మూలము అని కూడా చెప్పవచ్చును.

గురువు ఒక సిద్ధ గురువు అయితే, శిష్యుడు పరిపక్వమున్నవాడు అయితే, వాగ్రూపక మంత్రోపదేశమే అక్కర్లేదు. కానీ గురుశిష్యుల మధ్య ఒక సంబంధం మాత్రం ఏర్పడాలి. అది ఎట్లా సాధ్యం? గురువు శిష్యుని వంక ఒక మారు చూస్తే చాలు. అదే కటాక్ష దీక్ష అవుతుంది. వలసిన సంబంధం ఆ కటాక్షమే కలిగిస్తుంది. కటాక్షమాత్రాన శిష్యునికి జ్ఞానోపలబ్ధి ఏర్పడుతున్నది. గురువు శిశ్యుని శిరస్సుని స్పృశించడం కూడా దీక్షయే. దీనిని హస్త మస్తక దీక్ష అని అంటారు. కొన్ని సమయాలలో ఇవి ఏమీ అక్కర్లేదు, ఇవన్నీ స్థూల క్రియలు. గురువు సంకల్పం మాత్రాన "ఈ బిడ్డకు ఆరోగ్యం కలగాలి" అని అనుకున్న మాత్రంలో, అది ఉపదేశతుల్యమై గురుశిష్య సంబంధాన్ని వెంటనే సృష్టిస్తుంది.

(సశేషం....)



సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.

-- SRI MOHAN KISHOR NEMMALURI

గురువు - ఆచార్యుడు

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు
శ్రీ గురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః
శ్రీ శరవణభవాయ నమః
శ్రీమాత్రే నమః
ఓం నమః శివాయ
శ్రీ సీతారామాభ్యాం నమః
శ్రీ హనుమతే నమః
గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!

 
పెద్దలందరికీ నమస్కారము,

పూజ్యులు ప్రాతఃస్మరణీయులు కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతులు,నడిచే దేవుడు, పరమాచార్య, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర స్వరస్వతీ మహాస్వామి వారు తమిళంలో చేసిన ప్రవచనములలో, "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" అనే అంశముపై చేసిన ప్రవచనముల యొక్క తెలుగు అనువాదము, కామకోటి వారి సైట్ లో లభిస్తే, దానినే యథాతథంగా, మరొక సారి పునశ్చరణ చేసినట్లు అవుతుందనీ, ఇలా వ్రాయడం వల్ల, జగద్గురువుల అనుగ్రహం లభిస్తుందనీ ఆర్తితో, నేను నేర్చుకోవడం కొరకు, నా ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసమై, ఇక్కడ వ్రాసుకుంటూ, అందరితోనూ పంచుకుంటున్నాను. తప్ప ఇక్కడున్న పెద్దలకు తెలియనివి కావు.


1. గురువు - ఆచార్యుడు
మనం సాధారణంగా వాడుకలో రెండు పద ప్రయోగాలు చేస్తూ ఉంటాము. ఇవి మనం పర్యాయ పదాలుగా భావించినా, పండితులు ఈ రెండిటినీ కాస్త భిన్న దృక్పథంలోనే చూస్తారు. ఆ పదాలే "గురువు", "ఆచార్యుడు".

ఆచార్యుడు అనే పదం - ఆచరణ, ఆచార అనే పదములకు సంబంధించినది. చర అంటే నడుచుత, చరిత, చరిత్ర అంటే నడత. దేశ చరిత్ర అంటే ఒక దేశములో ఏమేమి జరిగినదో తెలిపే పుస్తకం. జీవిత చరిత్ర అంటే ఒక మనిషి పుట్టినదాది ఏమేమి చేశాడో చెప్పే కథ. ఆచారం అంటే ఒక సమూహములోని వాడుకలు, నడవడికలు.

ఆచార్యుడు అంటే మనం జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధమైన నైతిక ప్రవర్తన శిష్టాచారములను అనుసరించాలో చూపే మార్గ దర్శకుడు. అహింస, సత్యము లాంటి సామాన్య ధర్మములు మనకున్నవి. మన మతములో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. ఆచారాలున్నాయి. ఒక్కో సాంప్రదాయానికి వేర్వేరు శాస్త్రాలున్నవి, వైష్ణవులది ఒక ఆచారము, మాధ్వులకు మరొక ఆచారం. ఒక్క శైవ సాంప్రదాయములోనే ఎన్నో శాఖలున్నవి. వీరశైవం, కాశ్మీరశైవం, పాశుపతం, సిద్ధాంతము ఇత్యాదివి.

ఆచార్య పదం వివరించే ఒక శ్లోకం ఉన్నది ... "అచినోతిః శాస్త్రార్ధాన్ ఆచారే స్థాపయత్యపి - స్వయం ఆచారతేయశ్చ తం ఆచార్య ప్రచక్షతే".
ఎవడైతే శాస్త్రార్ధములను చక్కగా విచారిస్తున్నాడో (ఇతరులకు వాటిని బోధిస్తున్నాడని గర్భితం), ఆ ఆచారములను తాను స్వయముగా అనుష్టిస్తున్నాడో, అంతటితో వదలక, ఆ ఆచారములను ఇతరులచే అనుష్టింపచేస్తున్నాడో... అతడే ఆచార్యుడు. ఇతరులకు బోధ చేయడం, తాను స్వయంగా ఆచరించడం. ఈ రెండూ చేసేవాడే నిజమైన ఆచార్యుడు.

మనం ఆచారం, అనుష్టానం అంటూ ఉంటాము. అవి రెండూ పరస్పర సంబంధము కలవి. శాస్త్రోక్తములైన ఆచారములను అనుసరించేవే సంప్రదాయాలు. శాస్త్రములనేవి విధి, నిషేధాలను నిర్ణయించే గ్రంధాలు. సంప్రదాయాలు అనూచానంగా వచ్చే వాడుకలు, ఆచారాలు. వైదిక మతము ఆధారముగా ఏర్పడినవే శాంకర, రామానుజ ఇతర వైదిక సాంప్రదాయాలు. శాస్త్రములు సామాన్యముగా ఉన్నా సాంప్రదాయములు వేరుగా ఉండవచ్చు. ఈ విధంగా ఒక నియమ జీవనం చేస్తూ శాస్త్రోక్తమైన ఆచార అనుష్టానాలను పాటిస్తూ, ఇతరులకు బోధిస్తూ, వారిచే వాటిని అనుష్టింపచేస్తూ, తాను ఇతరులకు ఒరవడిగా ధర్మమూర్తిగా ఉన్నవాడే ఆచార్యుడు. అట్టి ఆచార్యునికి ఒక శిష్యుడు ఉండాలి. ఆ శిష్యునికి తన సాంప్రదాయ ధర్మములను బోధించి అనుష్టింపచేయాలి. అతడు విద్వాంసుడిగా ఉండాలి. విద్వత్తు లేకపోతే అతడు ఇతరులకి ఏమి బోధ చేయగలడు? తన అనుచరుల ధర్మ సందేహాలకు అతడు జవాబు చెప్పాలి. తన సాంప్రదాయానికి ప్రతి పక్షంవారికి యుక్తి యుక్తముగా జవాబు చెప్పాలి. అట్టివాడే ఆచార్యుడు అనిపించుకొంటాడు.

ఈ కాలంలో ఆచార్యులు బళ్ళు, కళాశాలలో ఉండే అధ్యాపకులు. వారికి ఆచరణలో కానీ, బోధనలో కానీ ఏ విధమైన ధర్మమూ లేదు. పూర్వకాలంలోనూ కళలకు ఆచార్యులు ఉండే వారు. ద్రోణాచార్య, కృపాచార్యులు ధనుర్వేద ఆచార్యులు. వారు వారి కళలలోనే కాక సాంప్రదాయములోనూ ధర్మములోనూ కుశలులు. వారి యొక్క అనుష్టానాలకే వారు గౌరవింపబడినారు.

2. గురు లక్షణం
ఆచార్యుని సమక్షంలోనే ఉంటూ విద్యాభ్యాసం చేయడం గురుకులవాసం. కానీ దానిని "ఆచార్య-కుల వాసము" అని మనం అనడం లేదు. అందుచేత గురువు-ఆచార్యుడు ఒక్కరే అని ఆర్ధం అవుతుంది. జగద్గురు శంకారాచార్య అని వ్యవహరించినప్పుడు, ఒకే వ్యక్తి గురువుగా, ఆచార్యుడిగా ఉన్నారని అర్ధం.

గురువు అంటే ఏమిటి? గురువు అనగా ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం. గురువు దేనిలో పెద్ద?? మీరందరూ నన్ను పెరియావా, పెరియావర్ అని పిలుస్తారు. (ఈ మాటలు పరమాచార్య స్వామి వారు ప్రవచనాంతర్గతముగా భక్తులతో అన్నవి....). నేను దేనిలో పెద్ద? శరీర ప్రమాణంలోనా? నాకు శంకరాచార్యుడు అని పేరు ఉండడం వలన మీరందరూ ఆయన గుణగణములూ, మహత్వమూ నాలో ఉన్నదని ఏమరి, నన్ను పెరియావా అనీ, మహాన్ అనీ పిలుస్తున్నారు.

మొత్తం మీద గురువు అంటే అంతర్గతముగా ఒక ఉత్తమ స్థితిని అందుకొన్నవాడు అని తేలుతోంది. బాహ్యంలో ఒక వ్యక్తి యొక్క నడతా, విద్వతూ అతనిని ఆచార్యునిగా నిర్దేశిస్తుంది. అతని ఆచార అనుష్టానాల వలన, అతని బోధనా చాతుర్యం చేతనూ, అతని శీలసంపద చేతనూ మనం ఒకరిని ఆచార్యునిగా ఎన్నగలము.

ఇక గురువు మాట ఏమిటి? అతను బహిరంగముగా ఏదీ చేయవలసిన అవసరము లేదు. అతనికి శాస్త్ర పరిజ్ఞానమో విద్వత్తో ఉండనక్కర్లేదు. ఆచార్యుని వలె అతను సాంప్రదాయ, ఆచార అనుష్టానాలకు మార్గదర్శిగా ఉండనవసరమూ లేదు. అతను నోరు తెరిచి మాట్లాడవలసిన అవసరమూ లేదు. ఉపదేశాలు ఇవ్వనక్కర్లేదు. ఎంతో మంది మౌనగురువులు, ధ్యాననిష్ఠులు ఉంటారన్న విషయం మనకి తెలిసనదే.

తాను తానుగా ఉంటూ, ఏకాంతంగా పూర్ణత్వం భజిస్తూ, ఎవరైనా ఉంటే అతని ప్రభావం గుర్తించి ప్రజలు అతనిని గురువుగా వరిస్తారు. అంతమాత్రాన అతడు వీరికి శాస్త్రపాఠాలు చెప్పవలసిన అవసరము లేదు. అతనిని గురువుగా వరించిన వారికి అతని అనుగ్రహశక్తియే పనిచేస్తుంది. వీరిని అతడు శిష్యులుగా భావించి కూడా ఉండకపోవచ్చును. కానీ ఆయనను గురువుగా ఏ ఫలాన్ని ఉద్దేశించి ఆశ్రయించారో, ఆ ఫలం వీరికి శులభంగా సిద్ధిస్తున్నది.

ఏ శాస్త్రాచారమూ పాటించని ఇలాంటి గురువులెందరో ఉన్నారు. ఉన్మత్తులవలె, పిశాచముల వలే నిరంకుశులుగా తిరిగిన అత్యాశ్రములు ఎందరో గురువులుగా మన దేశంలో ఉండేవారు. ఈ విధంగా దిగంబరంగా తిరిగిన దత్తాత్రేయులు అవధూత గురువు అని ప్రసిద్ధి పొందారు.

ఒక మార్గాన్ని అనుసరించి పోయేవాడు ఆచార్యుడు. ఒక శాస్త్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ, అతడు శాస్త్ర నిష్ణాతగా ఉండడమే కాక, శాస్త్ర విధులను తాను అనుష్టిస్తూ ఇతరులకు బోధచేస్తూ, వారిచేత వానిని అనుష్టింపచేస్తూ
విధివిధానముగా మార్గదర్శకముగా ఉండేవాడే ఆచార్యుడు. గురువు అట్లా కాదు.  అతనిని మహాత్ముడు అంటారు, అతని ఆత్మానుభవం కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉండడం చేతనే అతనిని ప్రజలు గురువుగా వరిస్తున్నారు. వారికి శీలానుష్టానాల అవసరం లేదు. వారికి శాస్త్ర విజ్ఞానం ఉండాలన్న నియమం లేదు. వారు జ్ఞానులు, వారెప్పుడూ బ్రహ్మ నిష్టలో ఉండేవారు. వారెప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలో ఉండే ఆనందోన్మత్తులగానో, చిత్తవృత్తుల నిరోధంతో సమాధి స్థితిలో ఉండే యోగులగానో ఉంటారు.

ఒక గురువు స్వయంగా "గురుత్వం" ఒప్పుకోకపోయినా, "నేను నీ శిష్యుడను" అని అతనిని ఆశ్రయించిన వాని మధ్యా, అయిష్టుడైన ఆ గురువు మధ్యా ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం అతని అనుగ్రహం వల్లనే. గురువు అంటే ఘనమైన వాడు అని చెప్పాము. ఒకరికి అంతరంగిక ఘనత ఉంటుంది. కానీ అతనికి బహిర్ప్రపంచముపైన ఏ కోరికా లేకపోవచ్చు. అతనికి అతని ఆత్మానుభూతిలోనే నిష్ట, అతడు గురువుగా చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు. 'గు' అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం. గురువు అంటే చీకట్లను పారద్రోలేవారు. అజ్ఞాన నివర్తకుడు. దేశ శబ్దానికి ప్రకాశరూపి అని అర్ధం. "తమసోమాజ్యోర్గమయ". మనం అంధకారంలోంచి ప్రకాశంలోకి రావాలి. తమస్ అంటే చీకటి, జ్యోతిస్ అంటే వెలుతురు. అజ్ఞానం అంటే చీకటి, వెలుతురు (జ్ఞానం) ప్రకాశిస్తే కానీ చీకటి పోదు. ఒక విషయాన్ని గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్ధిచేత దానిని గ్రహిస్తాడు. అజ్ఞానమనే అంధకారంలో ఉన్న శిష్యునికి జ్ఞానబోధ చేయగలిగినది ప్రకాశరూపియైన గురువు ఒక్కడే.

ఒక మహాత్ముడుంటాడు, అతనికి శాస్త్ర విజ్ఞానం లేదు, అతని అనుష్టానమూ శాస్త్రీయము కాదు. శాస్త్రబోధ అతనికి కానిపని. అయినపటికి అతనిని ఎవరైనా 'గురువు'గా ఆశ్రయిస్తే, అతను ఆశ్రయితుడి అంతర్ధ్వాంతాన్ని అనయాసంగా పోగొట్టగలడు. అతని అనుగ్రహం చేత అనధీతమైన శాస్త్రాలన్నీ ఆశ్రితునికి అవగతాలౌతాయి.

గురువంటే చీకటిని పోగొట్టేవాడు. అతని ఆత్మశక్తి బహిర్ముఖంగా పనిచేస్తుంది. అతను వాగ్రూపముగా వరదానము చేయడంలేదు. మార్గదర్శకముగా ఉండాలన్న కోరికా అతనికి లేదు. అనుగ్రహం చేద్దామన్న ఇఛ్చయూ లేదు. కేవలం ఈశ్వర శక్తి, శిష్యుని గురుభక్తి మెఱుపువలే వరప్రదానం చేస్తుంది. అతను అల్పమైన ప్రాపంచిక విషయాభిలాయగానైనా ఉండవచ్చు. లేదా అతడు బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించి అయినా ఉండవచ్చు.

ఒక కర్తవ్యం జరగాలంటే గురు-శిష్య సంబంధం ఉండాలి. ఇంట్లో దీపం వెలిగించాలంటే, విద్యుఛ్చక్తికీ దీపానికీ మధ్య లంకె ఉండాలి. ఆ లంకె తంతి ద్వారా ఏర్పడుతుంది. జలాశయాలనుంచి ఇంట్లో కొళాయిలోకి నీళ్ళు రావాలంటే, పెద్దజలాశయము నుండి నగరానికి మధ్య పైపులు వేయాలి. అప్పుడే కొళాయి నుంచి నీళ్ళు రాగలవు. గురువు వాగ్రూపముగా ఉపదేశము చేస్తూ ఉంటే, గురుశిష్యుల మధ్య సంబంధం గురువు వాక్కులే. లేదా గురువు జీవితములోని ఆచార వ్యవహారాలే శిష్యుడికి ఉపదేశ ప్రాయముగా ఉంటాయి. గురువు మౌనముగా ఉంటూ ఒక సంకల్పము చేస్తే, అదే శిష్యునికి ఉపదేశమవుతుంది. గురువు ఉపన్యాసాల చేతనే ఉపదేశం చేయాలన్న నియమమేమీ లేదు. ఆయన జీవితమే ఒక పెద్ద ఉపదేశం. ఉపదేశ విధానము స్థూలమే కాదు, సూక్ష్మము కూడా.

ఒక గురువు వాగ్రూపముగానూ, తన ఆచార, అనుష్టానము చేతనూ శిష్యునికి బోధిస్తే, అతనిని ఆచార్యుడని అంటారు. ఒకడు ఉపదేశమూ చేయకపోవచ్చు. మార్గదర్శకంగా ఉండకుండా పోవచ్చు. కానీ అతని అనుగ్రహమే గురుశిష్యుల మధ్య ఏర్పడిన అవ్యక్త సంబంధమని ఇదివరకే చెప్పాను.. (పరమాచార్య వారి మాటగా దీనిని చదవగలరు..). ఆ అనుగ్రహమే అతడిచ్చే ఉపదేశము.

ఇట్లా ఉండే గురువులలో కొందరూ ఆచార్యులుగా ఉండడమూ కద్దు. శిష్యులకు బోధిస్తూ, శాస్త్రానుష్టానాలను స్వయంగా ఆచరిస్తూ అంతరంగములో సమాధి అవస్థలో ఉండగల గురువులూ ఉన్నారు. శంకర భగవత్పాదులు ఇటువంటి గురువులు. ఇతర సాంప్రదాయలలోనూ ఒకే వ్యక్తి గురువుగా ఆచార్యునిగా ఉన్నవారు ఉన్నారు.

పూర్వకాలములోని విద్యాగురువులు గొప్ప శీలమూ నిష్టా కలిగినవారు. ఆత్మానుభూతి కానీ, సమాధి అవస్థ కానీ వారు ఎరుగకపోవచ్చును. కానీ ఆచార అనుష్టానాల బలం చేత వారు గురుకులములను నడుపుతూ శిష్యకోటికి విద్యాదానం చేసేవారు. మరికొందరు స్వయంగానో, లేక శాస్త్ర సమ్మతమైన దానినో ఆశ్రితులకు ఉపదేశం చేసేవారు ఉండేవారు. అట్లు ఉపదేశం చేసిన వారి జీవిత కాలంలో వారి బోధనా విధానం శాస్త్ర విధానంగా పరిగణింపబడకపోయినా వారి అనంతరం వారి విధానం, వారి పేరిట చెలామణీ అయి వ్యాప్తి చెందేది. అట్టి గురువులు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకున్నవారే. ఏ విధానానికి సంబంధించని గురువులూ ఎంతో మంది ఉన్నారు.

(సశేషం...)

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

-- SRI MOHAN KISHOR NEMMALURI

Friday, February 8, 2013

వేదములు

వేదములు--ఒక లఘు పరిచయము

         యాజ్ఞవల్క్యుని కథ చదువువారు ఈ పుస్తకములో అనేక చోట్ల  సంహిత , బ్రాహ్మణము , ఉపనిషత్తు అనే మాటలు  చదివి కొంత అయోమయమునకు లోను యగుట సహజము. వీటి అర్థము తెలుసుకోనిదే ఇందులోని కొన్ని విషయములు అర్థముకావు. అందుకని , కొన్ని ప్రాథమికమైన విషయములను ఇక్కడ చర్చించడమైనది. 

అసలు వేదమనగానేమి ? 

         వేదమంటే ’ జ్ఞానము ’ అని అర్థము. పరమాత్మ , జీవులు , దేవతలు , ప్రకృతి , ధర్మము మొదలగు విషయములను గురించిన జ్ఞానము. అతి పవిత్రమై , అత్యంత ప్రామాణికమై , మన ధర్మములు , దర్శనము , సమాజము మొదలగు వాటిపై అంతిమ నిర్ణయమును చెప్పు అధికారమున్న గ్రంధమే వేదమని చెప్పవచ్చును. అది అతీంద్రియ సత్యములను తెలియగోరు అందరు సాధకుల పవిత్ర గ్రంధము. 

వేదమను పదము , ’ జ్ఞానము ’ అథవా ’ పొందుట ’ యను అర్థమును ఇచ్చు ’ విద్ ’ అను ధాతువు నుండీ ఏర్పడ్డ శబ్దము. 

|| వే॒దేన॒ వై దే॒వా అసు॑రాణాం వి॒త్తం వేద్య॑మవిన్దన్త॒ తద్వే॒దస్య॑ వేద॒త్వమ్ ||

అనే తైత్తిరీయ సంహితలోని ఈ మంత్రము వలన ఈ విధముగా తెలియుచున్నది: అసురులు పొందిన , మరియు ఉపయోగించనున్న ద్రవ్యములను దేవతలు దేనివలన తెలుసుకొని పొందినారో , అది వేదము. 

వేదమంటే జ్ఞానము మాత్రమే కాదు.  అది , మానవుడు కాంక్షించు అనేక విషయములను అతనికి తెచ్చి ఇవ్వగల సామర్థ్యము కలిగినది. 

|| ఇష్ట ప్రాప్త్యనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంధో వేదయతి స వేదః ||

కోరిన ఇష్టములను పొందుటకును , కీడు ను తప్పించుకొనుటకును గల అలౌకిక ఉపాయమును తెలుపు గ్రంధమే వేదము అని ఆచార్య సాయణులు తమ ’ కృష్ష్ణ యజుర్వేద సంహితా భాష్యము ’ లో చెప్పినారు.

వేదములెన్ని ?

         వేదమనునది అపారమైన జ్ఞాన రాశి. ఎవరూ కూడా దానిని సంపూర్ణముగా తెలుసుకొనుటకు సామర్థ్యులు కాదు. జ్ఞానము అనంతమైనట్లే , ఆ దివ్య జ్ఞానమునకు శబ్దరూపమైన శరీరము వలెనున్న వేదరాశి కూడా అపారమే. అట్టి అపారమైన గ్రంధరాశిని అధ్యయనము చేయుటకెలాగూ సాధ్యముకాదని నిరాశ చెంది అల్పబుద్ధిగల మనుష్యులు వేదాధ్యయనమునే నిలిపివేస్తారేమోనని , వేదమే కనుమరుగౌతుందేమోనని శంకతో మహాత్ములైన కృష్ణద్వైపాయనులు వేదముల విభాగము చేసినారు. అఖండమైన ఆ వైదిక వాఙ్మయమును ఋగ్వేదము , యజుర్వేదము , సామ వేదము అథర్వణ వేదము యని నాలుగు భాగములు చేసి తమ శిష్యులొక్కరితో వాటి పరంపరను కొనసాగించునట్లు చేసినారు. ఈ విధముగా నాలుగు విభాగములు గల వేదములో ఏదైనా ఒక భాగమును ప్రధానముగా అధ్యయనము చేసి మిగిలిన భాగములయొక్క సామాన్య పరిచయమున్ననూ చాలునని , అ విధముగా అనేకులు తమ తమ శాఖను అధ్యయనము చేయుటవలన వేదపరంపర కొనసాగునని ఈ యోజన చేసినారు. 

అలాగ వేద విభజన చేసిన కృష్ణద్వైపాయనులు వేదవ్యాసుడు గా ప్రసిద్ధికెక్కినారు.

        ఆయా వేద శాఖను మాత్రము విశేషముగా అధ్యయనము చేసినవారికి ప్రకృతి దోషము వలన తమ వేదశాఖయే గొప్పది , తక్కినవి అధమము అను తప్పుభావన రాకూడదని , ప్రతియొక్క శాఖా విద్వాంసులూ ఒక్కటిగా చేరి తమ తమ ప్రావీణ్యమును ప్రకటిస్తూ ఒక కర్మను నెరవేర్చినపుడు తామందరూ ఒకే వేద వృక్షమును ఆశ్రయించిన వారము అన్న ఎరుక అందరికీ కలుగును. ఇలాగ అన్ని వేదముల విద్వాంసులూ చేరి నెరవేర్చు కర్మయే ’ యజ్ఞము ’ . 

        నాలుగు వేదశాఖలలో ఏ ఒక్క వేద విద్వాంసుడు లేకున్ననూ ఆ యజ్ఞము జరగదు. అన్ని వేదముల సహకారము వల్లనే యజ్ఞము సంపన్నమగును. యజ్ఞములో భాగము వహించు ఋగ్వేదపు ఋత్త్విజుడిని " హోతా  ( హోతృడు ) "  అనీ , యజుర్వేదపు ఋత్త్విజుడిని " అధ్వర్యుడు " అనీ , సామవేదపు ఋత్త్విజుడిని " ఉద్గాతా " యనీ , అథర్వణవేదపు ఋత్త్విజుడిని" బ్రహ్మా " అనీ అంటారు. 

( ఇవన్నీ కాక , ప్రతి వేదములోనూ అనేక శాఖలున్నవి... పొడిగించుట లేదు )

        వేదమును నాలుగు భాగములుగా విభజించినట్లే , ’ సంహితా ’ , ’ బ్రాహ్మణము ’ , ’ ఆరణ్యకోపనిషత్తు ’ అని కూడా విభజించబడినది. ఈ విభాగము అన్ని వేదములకూ ఉంది. వీటిలో ఆరణ్యక , ఉపనిషత్తులను ఒకటిగా భావించి , మొత్తము మూడు విధములుగా విభజింపబడుట వలన  వేదములకు " త్రయీ " అన్న పేరు కూడా ఉంది. 

సంహిత

        వీటిలో సంహిత అంటే " ఒకచోట చేర్చిన " భాగము. వేరే వేరే ఋషులు మంత్రద్రష్టలై కనుక్కున్న మంత్రములను ఒక క్రమ పద్దతిలో చేర్చి , ఒకేచోట కలసికట్టుగా కూర్చిన భాగము. దీనినే , ఇంకో విధముగా , అంటే , పదపాఠమును స్వరము , సంధి--ఇత్యాది నియమానుసారముగా కూర్చి దండాకారముగా పారాయణ చేయుటకు అనువుగా అలవరచిన వేదమంత్రములు. వివిధములైన యజ్ఞయాగాదులలో ఉపయోగించవలసిన మంత్రములు మాత్రమే ఉన్న భాగమును సంహిత అంటారు.  ఐతరేయ , తైత్తిరీయ , వాజసనేయ , కౌథుమీయ, శౌనకీయ సంహితలు కొన్ని ఉదాహరణలు. 

         ప్రకృతి ప్రత్యయములు లేదా, పదములు మధ్యలో విరామములేకనే చేరియుండుట కూడా సంహిత అనిపించుకుంటుంది. పైన చెప్పిన సంహితలలో అనేక మంత్రపాఠములలో కొన్ని వందల పదములు ఒకే వాక్యములో నుండుటను గమనింపవచ్చు. 

       ఇంకొక విషయము : వేదములో ’ సంహిత ’ అన్న పదము మంత్రముల సమూహములతో కూడిన భాగమునకు మాత్రమే వర్తిస్తుంది. ఋగ్వేద , శుక్ల యజుర్వేద సంహితలలో మంత్ర భాగము మాత్రమే ఉంది. అయితే , కృష్ణ యజుర్వేదములోని ( తైత్తిరీయ ) సంహితలో బ్రాహ్మణ భాగమూ , మంత్ర భాగమూ చేరి కనిపిస్తాయి. అలాగే , కృష్ణ యజుర్వేద బ్రాహ్మణములో కూడా బ్రాహ్మణ భాగమూ , మంత్ర భాగములూ కలసిపోయి కనిపిస్తాయి. 

మరి బ్రాహ్మణము అంటే యేమిటి ? 

          బ్రాహ్మణము అంటే సంహిత యొక్క మంత్రముల వ్యాఖ్యాన రూపమైన గద్య గ్రంధము. బ్రహ్మమును ( అంటే మంత్రమును ) వివరించుట వలన వీటికి ’ బ్రాహ్మణము ’ అని పేరు. ఈ బ్రాహ్మణములో , ’ సంహితా మంత్రములను యజ్ఞములలో వినియోగించుట యెలాగ ? యే కాలములో యే కర్మను యెలాగ చేయవలెను ? అనుదానినీ , దానికి సంబంధించిన ఉపాఖ్యానములనూ వివరించే వేద భాగము ఉంటుంది.

       ఐతరేయ , కౌషీతకీ బ్రాహ్మణములు ఋగ్వేదమునకు సంబంధించినవి. తైత్తిరీయ , శతపథ బ్రాహ్మణములు యజుర్వేదమునకు సంబంధించినవి. తాండ్య , జైమినీయ , షడ్వింశ బ్రాహ్మణములు సామవేదమునకు సంబంధించినవి. గోపథ బ్రాహ్మణము అథర్వణవేదపు బ్రాహ్మణము. 

        బ్రాహ్మణములను ఇంకొక రీతిలో కూడా వివరించవచ్చును. వేదములోనే వచ్చు ఇతిహాసములు , పురాణములు కొన్ని ఉన్నాయి. వాటిని బ్రాహ్మణములనే తెలుసుకోవలెను. కాబట్టి , మంత్రము మరియూ బ్రాహ్మణములను వివరించునపుడు మంత్రమనగా , " యాజ్ఞిక నిష్ఠ మంత్రత్వ ప్రకారక ప్రసిద్ధి విషయత్వమ్ " అని శాస్త్రములో చెప్పబడియున్నది. యజ్ఞము చేయువాడు దేనిని మంత్రమని గుర్తించి చెప్పునో అదే మంత్రము అని ఆ వాక్యపు అర్థము. " శేషే బ్రాహ్మణ శబ్దః " అను మాట , మంత్రములు తప్ప మిగిలినవన్నీ బ్రాహ్మణభాగమే అని తెలుపును. కాబట్టి , వేదములోనున్న కొన్ని పురాణములూ , గాథలూ , కల్పములూ , నారాశంసీ-- ఇవన్నీ బ్రాహ్మణపు అంతర్గతములే. ( నారాశంసీ అంటే మనుష్యుల కథలను తెలుపునవి )  అంతే కాక , దీనివలన వేదములో ఇవన్నీ ఉన్నాయి అని కూడా తేటతెల్లమవుతుంది. 

బ్రాహ్మణమును కూడా విధి , అర్థవాదము అని రెండు విధములుగా విభజించవచ్చు. (  దీనిని పొడిగించుట లేదు. )

ఆరణ్యకోపనిషత్తులు

         కర్మమును వివరించు సంహితా బ్రాహ్మణములకూ , మరియూ శుద్ధ జ్ఞానమును ఉపదేశించు ఉపనిషత్తులకూ  సేతువు వంటివి ఆరణ్యకములు. ఇవి గద్యరూపములో ఉండును. ఆరణ్యకపు చివరి భాగమునే ఉపనిషత్తు అంటారు. అందుకే ’ ఆరణ్యకోపనిషత్ ’ అని కలిపి పిలుస్తారు. యజురారణ్యకములో ’ అరణ్యేధీయీత ’ అను వాక్యమును బట్టి , ఇవి ( ఆరణ్యకములు ) అడవిలో అధ్యయనము చేయవలెను అన్న నియమమునకు లోబడినవి. ఆరణ్యకోపనిషత్తులు కొన్ని చోట్ల కర్మ కాండ , ఉపాసనా కాండ , మరియూ జ్ఞాన కాండకూ కూడా సంబంధించియున్నాయి. 

         ఆరణ్యకోపనిషత్తులు యజ్ఞములకు తాత్త్వికమైన అర్థమును ఇచ్చి , మనలను జ్ఞానము వైపుకు మరల్చును. ’ అరణులు ’ ( నివృత్తి ధర్మములోనున్న నైష్ఠికులు , సన్యాసులు ) అధ్యయనము చేయుటకు యోగ్యమై , అతి పవిత్రమూ రహస్యమూ అయిన విద్య యొక్క గ్రంధములు కాబట్టి వీటికి ఆరణ్యకములు అని పేరు. 

తైత్తిరీయ ఆరణ్యకము , ఐతరేయ ఆరణ్యకము , బృహదారణ్యకము , తలవకారారణ్యకము--కొన్ని ఉదాహరణలు. 

          ఉపనిషత్తులు జీవ , బ్రహ్మ , జగత్తు మొదలగు రహస్యములనూ , దివ్య జ్ఞానమునూ అందించు వేదభాగములు. వీటికి ’ వేదాంతము ’ అనికూడా పేరు. వేదపు సిద్ధాంతమును చెప్పుట వలననూ , వేదపు చివరలో వచ్చుట వలననూ వీటిని వేదాంతము అంటారు. ’ ఉపనిషత్ ’ అన్న పదమునకు రహస్య విద్య , ఆచార్యుని దగ్గర కూర్చొని మాత్రమే నేర్చు విద్య , ఉపాసనా విద్య , పరమాత్ముని దగ్గరకు చేర్చు విద్య , పరమ శ్రేయస్సుకు స్థానమైన విద్య , సంసార బంధనమును సడలించు విద్య --అవిద్యను నాశనమొనరించు విద్య - మొదలైన అర్థములున్నవి.

        ఈశావాస్యోపనిషత్తు , కేనోపనిషత్తు , కఠోపనిషత్తు , ముండకోపనిషత్తు , మాండూక్యోపనిషత్తు , ఐతరేయోపనిషత్తు , తైత్తిరీయోపనిషత్తు , ఛాందోగ్యోపనిషత్తు , బృహదారణ్యకోపనిషత్తు అను పది ఉపనిషత్తులు ముఖ్యమైనవి. 
********************************************
కన్నడ భాషలో శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు రచించిన అద్భుతమైన కావ్యం " మహా దర్శన " ను తెలుగు లోకి అనువాదము చేయుచున్నాను. అనూహ్యమైన స్పందన గల ఈ ధారావాహికమును ఇక్కడ చదవవచ్చు  . ఇంతకు ముందు అదే రచయిత రాసిన " మహా బ్రాహ్మణ " పుస్తకమును " మంత్ర ద్రష్ట " గా అనువదించి ఇచ్చియున్నాను. 
- జనార్ధన శర్మ

Thursday, September 20, 2012

Sri Malladi Chandrasekhara Sastry

ఆయన పురాణ ప్రవచనం చెబుతుంటే ఎంతటివారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే!
ధర్మసందేహాలు కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు చెబుతుంటే ఆ వారం టి.ఆర్.పి. రేటింగ్ కచ్చితంగా ఆ చానల్‌దే! వారపత్రికలో పాఠకుల సందేహాలకు సమాధానాలు చెప్పేది ఆయనే అయితే ఆ పత్రికకే అత్యధిక పాఠకాదరణ! భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గాని, శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునుల కల్యాణానికి గానీ వ్యాఖ్యానం చెబుతుంటే అందరి చెవులూ అటు వొగ్గవలసిందే!
ఆయన గళం నుంచి వెలువడే ప్రతిమాటా సప్రామాణికం, సవ్యాఖ్యాన సహితం!
ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనే
మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారని!
ఇది ఆయన ఇన్నర్‌వ్యూ...



మాది గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, గోరంట్ల అగ్రహారం. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో మా తాతగారు రామకృష్ణ చయనులవారిని దత్తత తీసుకున్నారు. దాంతో మాకు హైదరాబాద్ మల్లాదివారని పేరొచ్చింది. మా తాతగారు పదిభాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ముహూర్తాలు పెట్టడం నుంచి శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతం వరకూ ప్రతి ఒక్క శాస్త్రమూ ఆయనకు కొట్టిన పిండే! ఆయన పరమ నైష్ఠికుడు.


ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయన ముగ్గురు మగసంతానంలో మా నాన్నగారు మధ్యలోనివారు. మళ్లీ వీరందరి సంతానంలో నేనే పెద్దవాడిని. అందువల్ల తాతగారికి నేనంటే చాలా ఇష్టం. 1925 ఆగస్ట్ 22 అర్ధరాత్రి, అంటే తెల్లవారితే వినాయక చవితి అనగా పుట్టాను. నేను నాలుగు నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు నన్ను తనవెంట తీసుకొచ్చు కున్నారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదమ్మ గారే నన్ను సాకారు. తాతగారే నాకు ఉపనయనం చేశారు. ఆయన వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌతస్మార్తాలు అభ్యసించాను.



మా తండ్రిగారు దక్షిణామూర్తి శాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితులు. ఆర్షసంప్రదాయాన్ని ఆయన వద్దనే అలవరచుకున్నాను. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రిగారు తర్కవేదాంత పండితులు. పినతండ్రి హరిశంకరశాస్త్రిగారు తెనాలిలో వేదవిద్యాపరీక్షాధికారిగా పని చేసేవారు. నేను వేదాధ్యయనం ఆయనవద్దే చేశాను. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నాను. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నాను.
తాతగారికి నేను పురాణ ప్రవచనం చెప్పాలని కోరిక. ఇంగ్లిషు చదువులు చదివితే, ఉద్యోగం చేస్తానంటానని నేను దేనికీ పరీక్షలు రాయ నివ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయితే నాకేమో పురాణాలు చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అది గ్రహించిన తాతగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘చూడు నాయనా, పురాణ ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాఙ్మయం తెలిసి ఉండాలి. నిశిత పరిశీలన కావాలి. అన్వయం చెప్పగలిగి ఉండాలి. వేదాంతం, తర్కం, ఛందస్సు తెలిసుండాలి. కాబట్టి దీన్ని అంత తేలికగా తీసేయకు’’ అని చెప్పేవారు.


నా పదిహేడవ యేట మా తాతగారు కాలం చేశారు. ఆయన దూరమైనా ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ నన్ను విడిచిపోలేదు. అమరావతిలో మా ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రిగారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో నన్ను పిలిచి రోజూ సాయంత్రం నాలుగు నుంచి 6 గంటల వరకు నాచేత పద్యాలు చదివించుకుని వినేవారు. మా ఊరిలో గోళ్లమూడి ప్రసాదరావుగారనేవైద్యుడు రోజూ సాయంకాలం సైకిల్ మీద రోగులను చూడటానికి వెళ్తుండేవాడు. ఆయన అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు నా పద్యాలు వినేవాడు.



ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి, ‘‘మీరు పద్యాలు చదువుతున్న తీరు బాగుంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఏమీ తోచడం లేదు. కాబట్టి మా ఇంటికొచ్చి పద్యాలు చదివి పెట్టండి’’ అని అడిగాడు. నేను మొహమాటం కొద్దీ కాదనలేక ఆయన ఇంటికెళ్లాను. ఆయన ఎప్పటి నుంచో అటకమీద దుమ్ముపట్టి ఉన్న భాస్కర రామాయణాన్ని తీసి నా చేతికిచ్చాడు. నేను అందులో నుంచి పద్యాలు చదువుతుంటే ‘‘మీరలా పద్యాలు చదివితే నాకెలా తెలుస్తుంది, వాటికి అర్థం తెలిస్తే కదా ఆనందించగలిగేది’’ అన్నాడు. దాంతో నాకు తోచిన రీతిలో అర్థాలు చెబుతూ పద్యాలను చదివి వినిపించాను.
నా పద్యశ్రవణం కాస్తా కొందరు గ్రామస్థుల చెవిన పడడంతో ఊరిలోనివాళ్లు కొందరు డాక్టరు గారి దగ్గరకొచ్చి ‘‘ఇదేదో సాయంత్రం పూట పెట్టుకుంటే మేము కూడా వచ్చి వింటాం కదా’’ అన్నారు.
దాంతో డాక్టరుగారు తమ ఇంటి వసారాను కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం, ఫొటో, పుస్తకం పెట్టారు. నేనూ చొక్కావిప్పి, ఉత్తరీయం ధరించి విభూతి రేఖలు దిద్దుకుని అచ్చం పౌరాణిక ప్రవచకుడిలా తయారై ఆ సాయంత్రం భాస్కరరామాయణాన్ని గ్రామస్థుల ముందు చెప్పాను. ఈవిధంగా దాదాపు నెల రోజులకు పైగా జరిగింది. ఊరిలో నాకు మంచి పేరొచ్చింది. అప్పటికి నాకు అర్థమైంది నేను పుట్టింది పురాణ ప్రవచనం చెప్పడానికేనని!



కొన్నాళ్లు గడిచాక బెజవాడ వెళ్లి వేదాంత శాస్త్రం చదవాలనే కోరికతో అమరావతి నుంచి బయల్దేరి గుంటూరు వచ్చాను. తీరా బస్టాండుకొచ్చాక పరిచయస్థులు కొందరు కనిపించి ‘‘పుష్పగిరి పీఠాధిపతులు ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నారు. త్వరలో ఆయన మకాం మార్చేస్తారట. ఈలోగా నువ్వొకసారి వెళ్లి ఆయన దర్శనం చేసుకోవచ్చు కదా’’ అన్నారు. దాంతో నేను వెంటనే నరసరావుపేటకు బయల్దేరాను.
స్వాములవారి దర్శనం చేసుకోగానే ఆయన నాతో ‘‘నువ్వు అమరావతిలో పురాణ ప్రవచనం చక్కగా చెప్పావని తెలిసింది. నాకు కూడా వినాలని ఉంది, ఇవ్వాళ ఇక్కడ పురాణం చెప్పు’’ అన్నారు. ఆ మాటలను ఆదేశంగా తీసుకుని ఆయన ముందు వాల్మీకి రామాయణం చెప్పాను. స్వామివారు చాలా సంతోషించి, ‘‘నిన్ను నెలకు 40 రూపాయల గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితునిగా నియమిస్తున్నాను’’ అన్నారు. దాంతో నేను వారితోపాటే ఊరూరూ తిరుగుతూ ఏడాదిన్నరపాటు పురాణ ప్రవచనం చెప్పాను.
ఆ తర్వాత మా పెత్తండ్రి మల్లాది వీరరాఘవశాస్త్రిగారు బెజవాడలో బ్రహ్మసత్రయాగం జరుపుతుంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు సంవత్సరంపాటు ప్రవచనం చేశాను. నా ఇరవై అయిదవ ఏట నా వివాహం ఈమనికి చెందిన సీతారామ ప్రసన్నతో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1951లో నాకు కొడుకు పుట్టాడు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ అని పేరుపెట్టాను. ఆ తర్వాత మరో ఐదుగురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలు.



వీరందరికీ చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు... అన్నీ పురాణ ప్రవచనాల ద్వారా ఆర్జించిందే తప్ప మరో విధంగా వచ్చింది లేదు. నా ప్రవ చన కార్యక్రమంలో పడి ఒక్కోసారి రెండేసి నెలలు కూడా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చేది. అటువంటప్పుడు నా భార్య ఎంతో ఓపికతో ఒంటి చేతిమీద ఇంటిని సమర్థించేది. ఆమె సహకారమే లేకపోతే నేను ఏమీ చేయగలిగేవాడినే కాదు! నా ప్రవచనాలను రాష్ర్టమంతా పంచగలిగి ఉండేవాడినీ కాను! ఈ వృత్తి ద్వారా నేను లక్షలార్జించి మేడలూ మిద్దెలూ కట్టిందీ లేదు అలాగని దారిద్య్రంతో బాధపడిందీ లేదు. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే భాగ్యంగా భావించాను!
బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతోబాటు చిత్తూరు వి.నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి వెండితెర వేల్పులు నా ప్రవచనాలను ఎంతో ఇష్టపడేవారు. ఓసారి చిత్తూరు నాగయ్యగారు నన్ను ఇంటికి పిలిచి భోజన వస్త్రాలతో సత్కరించి, చేతికి స్వర్ణకంకణం తొడిగారు.



అప్పట్లో చాలామంది నన్ను సినిమాలలో నటించమని అడిగేవారు. నాకు ఇష్టం లేక అందరినీ తిరస్కరించాను. నేను ప్రవచనం చెబుతుండగా శ్రోతలు వింటున్నట్లుగా ఉండే దృశ్యాన్ని చిత్రీకరించాలని కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకనో అది కూడా వీలు పడలేదు.
నాకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా గుంటూరులో ఒక తను నా పేరు చెప్పుకుని నేను వస్తానని ప్రచారం చేసుకుంటూ పురాణ ప్రవచనంతో పొట్టపోసుకుంటున్నట్లు తెలిసింది. నేనతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఓసారి అతను నన్ను కలిసినప్పుడు నా అంతట నేనే పురాణ ప్రవచనం చెబుతానని చెప్పాను. అతనెంతో సంతోషించి భారీ ఏర్పాట్లు చేశాడు.
నా ఉద్దేశం ఏమిటంటే నాకు తెలియకుండా నా పేరు చెప్పుకున్నందుకు పదిమంది ముందు అతని పరువు తీసేయాలని! తీరా నేనెళ్లి మైకుముందు కూర్చుంటే గొంతు పెగల్లేదు. కనీసం శుక్లాంబరధరం కూడా పలకలేక స్టేజీమీదినుంచి దిగిపోయాను. ఆ సంఘటనతో భగవంతుడెప్పుడూ భక్తుల పక్షపాతే కాని, అహంభావుల పక్షం వహించడని తెలుసుకున్నాను. ఈనాటివరకు మళ్లీ అటువంటి ఆలోచనలు చేయలేదు.



ఆ తర్వాతెప్పుడూ అటువంటి పరిస్థితీ నాకు ఎదురవలేదు. అదే కాదు, భగవంతుడి దయవల్ల అనారోగ్యం కాని, జలుబు చేయడం, గొంతు బొంగురుపోవడం వంటివి కానీ నన్నెప్పుడూ బాధించనే లేదు. అన్నేసి గంటలపాటు ప్రవచనాలు చెప్పినా, గొంతు తడారిపోవటం, కంఠశోష వంటివి ఎప్పుడూ ఎరగను. ఇప్పటివరకూ నేను 250 దాకా రామాయణ ప్రవచనాలు, 300 మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలూ చెప్పాను.
ఇవిగాక ప్రతియేటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవాడిని. దూరదర్శన్‌లోనూ, సప్తగిరి చానల్‌లోనూ ప్రవచనాలు చెబుతుంటాను. నాకిప్పుడు ఎనభై ఐదేళ్లు దాటాయి. ఒంట్లో ఓపిక సన్నగిల్లుతోంది, ప్రయాణాలు చేయలేకుండా ఉన్నాను. దాంతో 2011 జనవరి నుంచి నేను పురాణ ప్రవచనాలు చెప్పడం మానివేశాను.



అయితే ఇటీవల శ్రీవేంకటేశ్వర భక్తిచానల్, సప్తగిరి చానల్ వారు నా వద్దకొచ్చి ‘‘మీరు మా చానల్‌లో ప్రవచనం చెప్పవలసిందే’’ అని పట్టుబట్టడంతో మా ఇలవేల్పు పట్ల నాకున్న భక్తి, గౌరవం మేరకు వారిని కాదనలేకపోయాను. అందుకే అప్పుడప్పుడూ ఆ చానల్స్ వారికి మాత్రమే చెబుతున్నాను.
భగవంతుడు నాకిచ్చిన దానికి నేనెప్పుడూ అసంతృప్తి పొందలేదు. వైదిక ధర్మ ప్రచారం చేయడాన్ని, భగవంతుని లీలలను గానం చేయడాన్ని బాధ్యతగా భావించాను తప్పితే బరువనుకోలేదు. ఎవరికోసమూ ప్రత్యేకంగా చెప్పలేదు. సభలో భాగ్యవంతులున్నారా, పండితులున్నారా, పామరులున్నారా అని ఎన్నడూ ఆలోచించలేదు.
ఎవరినీ పనిగట్టుకుని పొగడలేదు. ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాను. కాకపోతే పదేళ్లకొకసారి సామాజిక పరిస్థితులలో మార్పు వస్తుంటుంది కదా, అందుకు అనుగుణంగా మారుతూ వచ్చానంతే! అదెలాగంటే అప్పట్లోలా ఇప్పుడు పద్యాలు చెబుదామన్నా వాటిని విని ఆనందించేవారు లేరు కదా, అందుకు తగ్గట్టుగానే నన్ను నేను మలచుకున్నాను. అప్పుడే కాదు, ఇప్పటికీ నేను ఏ ఘట్టం చెబుతుంటే ఆ ఘట్టంలో పూర్తిగా లీనమవుతాను.



అది శోకరసమైతే నాకు దుఃఖమొస్తుంది. సంతోషకర సన్నివేశమైతే ఆనందంతో పరవశించి పోతాను. కాబట్టే ఇన్నేళ్లు గడిచినా, నా ప్రవచనం వినడానికొచ్చే ప్రేక్షక జనంలో తగ్గుదల లేదు. అయితే నేను మాత్రమే గొప్పగా చెప్పగలను అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటివాళ్లు కూడా బాగానే చెబుతున్నారు. ఆదరణ కూడా బాగానే ఉంటోంది. ఈ సంస్కృతి చిరకాలంపాటు వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష!

సేకరణ:సాక్షి ఫన్ డేపురాణ’ పురుషుడు

Tuesday, April 24, 2012

అక్షయ తృతీయ


అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజు కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని డబ్బులేకున్నా అప్పు చేసో తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవ్వడం అటుంచి చేసిన అప్పులు తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అయ్యి కూర్చుంటాయి.


మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం..
ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. (పుణ్య కార్యాచరణం వల్ల వచ్చే ఫలితం అక్షయమైనప్పుడు పాపకార్యాచరణం వల్ల
వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుందిగా... ). ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మగారితో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాటి ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మమాచరించినా కూడా తత్సంబంధఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి, తరవాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్ఛిష్ఠంగా, బ్రాహ్మణోఛ్ఛిష్ఠంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరవాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. (అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము, అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారముని అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు)



శ్రీ నారద పురాణం కూడా, ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెప్తోంది. ఈ నాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో  ఈనాడు దానాది ఫలములు నారదమహర్షి ఇలా చెప్పారు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘ్రుత ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు,
సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై బంగారము, రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో  కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరవాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు.  అంతమున బ్రహ్మజ్ఙానియై ముక్తిని పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోలోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్ల తరవాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు. గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాదిపతి అగును. అతడు నిద్రించినచో భేరీ శంఖాది నినాదములచే మేల్కొలపబడును. సర్వ ధర్మ పరాయణుడై సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి  స్వర్కమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి స్వయముగా జ్ఙానియై అవిద్యను జ్ఙాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యముని పొంది పరబ్రహ్మమును పొందెదడు. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.


ఈ తిథినాడు పదహారు మాస మితమగు (పదహారు మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమానుడగును.


దీనివల్ల తెలిసేదేమంటే బంగారం కొంటే అక్షయం కాదు, ఈ రోజు చేసే ధర్మకార్యాలు, ఉపాసనలు, దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని.


తెలియని వారికి ఇది తెలియ చెప్పండి. ఈ నాడు డబ్బులు లేకున్నా అప్పు చేసి బంగారం యొక్క డిమాండు పెంచి తద్వారా ధర పెంచి, దేశ ఆర్థిక పరిస్థులను, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను ఇన్ఫ్లేషన్ పేర ఇబ్బంది పాలు చేయకండి.
--
మంచి విషయాన్ని తెలిసిన నాగేంద్ర  గార్కి ధన్యవాదములు 

Tuesday, March 27, 2012

అలెగ్జాండర్ మూడు కోరికలు



అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది.

... ఇంటికి వెళ్ళాలనే కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చ...ూపించి కన్ను మూయాలనే ఆశ. కానీ సమయం గడిసే కొద్దీ దిగజారుతున్న అతని ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు. నిస్సహాయంగా ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.

“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.

అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.

నా మొదటి కోరిక: ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”

రెండవ కోరిక: “నా పార్థివ దేహం స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”

మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”


చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా వచ్చి, ఆయన చేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.

అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”

“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.

“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”

“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”

అని చెప్పి కన్ను మూశాడు.


అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల చక్రవర్తే కావచ్చు. కానీ ఆయన గురించిన ఈ సంఘటనలో భారతీయ ఆత్మ ఉంది.
-Srinivas Potluri