A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Monday, September 8, 2014

పాలు పొంగించడం

నేటి కిచన్‌ లో అందరూ దాదాపు సిమెంట్‌ బల్లలు వాడుతున్నారు. సాధారణం గా మనం నూనె వస్తువులు ఎక్కువ వాడడం పరిపాటి. ఇక ఈ సిమెంట్‌ , టైల్స్‌ బల్ల పై ఈ నూనె వలగడం, తాలింపు ఆవిరి నుంచి వచ్చిన నూనె, కూర వగైరా వలిగినపుడు నూనె ఎంతోకొంత ఈ బల్ల పై వలగటం జరుగుతుంది.

ఇక మామోలు గా ఈ ప్రపంచం లో దాదాపు అన్ని వస్తువువలపై బేక్టీరియా పెరగట జరుగుతుంది. ఇక నూనె దానికి తోడై , ఆహార పదార్ధాలు ఉన్న చోట మామోలు కన్నా 20 రెట్లు ఎక్కువ (Citation needed) బాక్టిరీయా పెరుగుతుంది. పైగా , ఇలా (Oil) enriched culture medium లో పెరిగేవి హానికరమైన బాక్టీరియా. పొరపాటున మనం ఆ బల్ల పై చేతులు పెట్టడం , అవి అనుకోకుండా నోట్లో పెట్టుకోవడం అపుడప్పుడు జరగుతుంది. మరి అక్కడ హాని కరమైన బాక్టీరియా వల్ల అతిసారం , జ్వరం , ఇన్‌ ఫెక్షన్‌ లాంటివి రావచ్చు. ఇటువంటివి నివారించేదుకే మన పెద్దలు ఓ మహత్తరమైన ఐడియా లో ముందుకొచ్చారు.
"అదే పాలు పొంగించడం"
అవును పాలు పొంగి ఆ కిచన్‌ ఏరియా లో ప్రవహిస్తే , పాలలో ఉండే హాని లేమి బాక్టీరియా అయినట్టి లాక్టో బాసిలెస్‌ పెరిగి , హానికర బాక్టీరియా ఉనికి కి పోటీ గా మారుతాయి. అందుకే పాలు పొంగడం మంచిది, లక్ష్మీ దేవీ అని చెప్పారు మన పెద్దలు సింపుల్‌ గా. ఇక కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు పాలు పొంగించడం మన సంస్కృతి లో భాగం.
ఇక హింధూ సనాతన ధర్మాలలో విగ్రహాలకు పాలాభిషేకం చేయడం పరిపాటి. ఇక్కడ దేవాలయం అనగా ఎక్కువ మంది జనాలు వచ్చీ పోయే చోటు కనుక , పైగా పుణ్యం కోసం ప్రతీదీ స్పర్శించి ముక్కుకోవడం మన అలవాటు. అక్కడ కూడా కొబ్బరి కాయలు అవీ హానికర బాక్టీరియా పెరగడం వల్ల వాటి బారి నుంచి తప్పించడానికి పాలాభిషేకం చేస్తే ఎక్కువ పుణ్యం అని చెప్పారు . పైగా ఈ బాక్టీరియా , వల్ల దేవాలయం , ఊరులో కూడా చెడు బాక్టీరియా కౌంట్‌ తగ్గుతాది. అందుకే హింధూ సనాతన ధర్మాలు చాలా గొప్పవి. అభిషేకాలకు ఎందుకు అలా లీటర్లు లీటర్లు పాలు పారబోయడం, పేదలకు పంచండి అని వాగే కుహౌనా మేధావులకు ఈ విషయం ఓ మొఠ్టికాయ మొఠ్టి చెప్పండి. ఇక ఈ విషయం మన తరువాత తరాలకు చెప్పి , హింధూ ధర్మాల గొప్పతనం చెప్పండి.
by
Murthy Kanakala

No comments:

Post a Comment